GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : . అక్షరం ప్రతినిధి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ సహా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రభుత్వ దవాఖానల వద్ద పార్క్ చేసిన బైక్ లను ఎత్తుకెళ్తున్నారు. గత నెల 20న గాంధీ దవాఖానలో నిలిపిన ద్విచక్రవాహనాన్ని చోరీచ చేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించారు. బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీలు చేస్తున్నట్లు వారు ఒప్పుకోవడంతో 6 బైక్లు స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన సీఐ అనుదీప్, డీఐ రమేశ్ గౌడ్, ఎస్సె రాకేశ్ను ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్డీసీపీ నర్సయ్య, ఏసీపీ శశాంక్ డ్డి అభినందించి, రివార్డులు అందజేశారు.
.
Aksharam Telugu Daily