DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి, జనవరి 15 అక్షరం న్యూస్ : నిత్యం వినూత్న కథనాలతో ప్రజల సమస్యలను నిర్భయంగా వెలికి తీస్తూ, ప్రజాపక్షం వహిస్తూ ముందుకు సాగుతున్న అక్షరం దినపత్రిక ప్రజల మన్ననలు పొందుతోందని పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ భూక్య రామ్ రెడ్డి ప్రశంసించారు. అక్షరమే ఆయుధంగా ప్రజా హితాన్ని కాపాడుతున్న అక్షరం దినపత్రిక సమాజంలో చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గురువారం పెద్దపల్లి డీసీపీ కార్యాలయంలో అక్షరం దినపత్రిక రూపొందించిన 2026 సంవత్సరపు క్యాలెండర్ను ఆయన అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో మీడియా కీలకమైన నాలుగో స్తంభమని, ముఖ్యంగా ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లే బాధ్యతాయుత పాత్రను అక్షరం దినపత్రిక సమర్థంగా నిర్వర్తిస్తోందన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిజాయితీగా, నిర్భయంగా ప్రచురిస్తూ పరిష్కార దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించడంలో అక్షరం దినపత్రిక ముందుంటోందని తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలు, న్యాయం, అవగాహన పెంపొందించేలా కథనాలు రూపొందించడం అభినందనీయమన్నారు. అక్షరం దినపత్రిక భవిష్యత్తులో కూడా ఇదే ప్రజాపక్ష ధోరణితో కొనసాగుతూ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డీసీపీ ఆకాంక్షించారు. అక్షరం యాజమాన్యం, సంపాదక బృందం, పాత్రికేయుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అక్షరం దినపత్రిక పెద్దపల్లి ప్రతినిధి దొమ్మటి రాజేష్ పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily