Sunday, 12 April 2026 02:56:33 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గంగారం మండలం లో విషాదం పెళ్లి కి వచ్చి చెరువులో పడి వ్యక్తి మృతి

పెళ్లి వేడుకాకు వచ్చి అనంతలో కాలకు... * పెళ్లి సందడిలో పాల్గొనడానికి వచ్చిన ఓ వ్యక్తి అనుకోని ప్రమాదంతో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 05 April 2026 02:10 PM Views : 358

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : * మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఏప్రిల్ 5(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లో కోమట్లగూడెం (గామపంచాయతీ పరిధిలో ని పెళ్లి సందడిలో పాల్గొనడానికి వచ్చిన ఓ వ్యక్తి అనుకోని ప్రమాదంతో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది మహాదేవుని గూడెం గ్రామానికి చెందిన బోల్లపెల్లి సారయ్య(55) పెద్ద చెరువులో పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సారయ్య శనివారం కొమట్లగూడెంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యాడు. కార్యక్రమం అనంతరం బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు చెరువు వద్ద కాలుజారి నీటిలో పడినట్లు అనుమానిస్తున్నారు. ఆదివారం ఉదయం చెరువు వద్దకు వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న గంగారం ఎస్సై రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో మహాదేవుని గూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :