D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా /గంగారం /ఆగస్ట్ -17(అక్షరం న్యూస్ ) గంగారం మండలం లోని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపించే లక్ష్యంతో మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం గంగారం మండలం కేంద్రంలో ని రైతు వేదిక కార్యాలయంలో ప్రారంభమైంది. తొలిరోజు ఎంపిడివో డి వైష్ణవి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై ప్రజల నుంచి సమస్యలు, వినతులను స్వీకరించారు.మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు, భూ సంబంధిత సమస్యలు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, విద్యుత్, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు నేరుగా వివరించే అవకాశం కల్పించడంతో ప్రజావాణికి మిశ్రమ స్పందన లభించింది. వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని సమస్యలను పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో డి వైష్ణవి ప్రజలకు హామీ ఇచ్చారుప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే వేదికపై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల సమస్యల పరిష్కార ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఆయన తెలిపారు. ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.అయితే మండల స్థాయిలో పునఃప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి తొలి రోజున మిశ్రమ స్పందన లభించింది అని చెప్పుకోవచ్చు . సరైన ముందస్తు ప్రచారం కొరవడటం, అధికారుల సమయపాలన పాటించకపోవడం. వల్ల మండల కేంద్రం లో ప్రజలు తక్కువ సంఖ్యలో వచ్చి అర్జీలు అందజేశారు.వచ్చిన అధికారులు చరవాణి చూసుకుంటూ కాలక్షేపం చేయడం కోసమేరుపు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి బాలకిషన్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily