AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 14/ అక్షరం న్యూస్/---- ఉద్యోగం పొందిన మొదటి నెలలోనే పేద విద్యార్దిని దత్తత తీసుకొని చదివించడం అభినందనీయంమని ఇంతటి మహత్కార్యంకు వడిగట్టిన సుందర మౌనిక యువత కే ఆదర్శనీయమని అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ పరిషత్ ప్రశిక్షణ టోలీ సభ్యులు కొరివింద రామచంద్రయ్య అన్నారు. చర్ల మండలం జిపి పల్లి గ్రామానికి చెందిన సుందర పెద్దిరాజు లక్ష్మి దంపతుల కుమార్తె మౌనిక ఇటీవల ఇండియన్ బ్యాంక్ లో ఆర్ డి వో గా ఉద్యోగం పొందింది. తన మొదటి వేతనం నుంచి 20 వేల నగదును వెచ్చించి వనవాసీ విద్యార్ది నిలయంలో ఒక విద్యార్దిని దత్తతకు తీసుకొంది. ఇలా మూడేళ్ల పాటు ఏడాదికి రూ. 20 వేల చొప్పున విద్యార్ది చదువుల కొరకు నగదును అందజేస్తాన్నాని ఆమె అన్నారు. గురువారం వనవాసీ కొమరం భీం విద్యార్ది నిలయంలో జరిగిన కార్యక్రమంలో నగదు కు సంబంధించిన పత్రాన్ని మౌనిక ఆమె తండ్రి పెద్దిరాజు వనవాసీ అఖిల భారతీయ ప్రశిక్షణ సభ్యులు రామచంద్రయ్య కు అందచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత చిన్న వయసులోనే గొప్ప మనసును చాటిన మౌనిక యువతీ యువకులకు ఆదర్శప్రాయంగా నిలచారని అభినందించారు. ప్రతి ఒక్కరూ పేద విద్యార్దుల చదువులకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు. యువత జీవితం చదువులతోనే ముడిపడి ఉంటుందని తెలిపారు. కుటుంబంలోని ఒక్కరు చదువుకొని ఉన్నత స్దితికి చేరుకుంటే ఆ కుటుంబం మొత్తం ఆర్దికంగా స్దితిమంతులవుతారని వెల్లడించారు. నిలయ కమిటీ సభ్యుల పనితీరు స్పూర్తిదాయకమని అన్నారు. పేద విద్యార్థుల చదువులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపట్టడం అబినందనీయమని పేర్కొన్నారు. విద్యార్దులు సైతం ఇటువంటి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్దితికి చేరుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వనవాసీ నిలయ కమిటీ గౌరవ సలహాదారు బివిఎస్ఎల్ నరసింహారావు, ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత, జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ, సంఘటనా కార్యదర్శి కోరెం రామారావు, ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్ బాబు, నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ, ఉపాద్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్, సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, సభ్యులు పాశికంటి శ్రీదేవి, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి కారం శేఖర్ సున్నం రాజేష్ పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily