Friday, 14 November 2025 01:16:22 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆదివాసీ ధర్మ యుద్ధం బహిరంగ సభను జయప్రదం చేయండి జేఏసీ చైర్మన్ తాటి రామకృష్ణ


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 26 September 2025 06:52 PM Views : 529

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల సెప్టెంబర్ 26/ అక్షరం న్యూస్/--- మండలంలోని 26 పంచాయితీలు అన్ని గ్రామాలను చర్ల జేఏసీ నాయకులు పర్యటించి లంబాడీల వల్ల ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు తాటి రామకృష్ణ మాట్లాడుతూ 1950 సంవత్సరంలో లేని లంబాడీలు చట్టబద్ధత లేకుండా ఎస్టీ రిజర్వేషన్ ఫలితాలు పొందుతూ అసలైన ఆదివాసులని మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. లంబాడీలు ఏజెన్సీ ఫలాలు పొందుతున్నారని 1976 దొడ్డి దారిన వచ్చిన లంబాడీల తరిమికొట్టే బాధ్యత ప్రతి ఒక్క ఆదివాసి తీసుకొని ఉద్యమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు లంబాడీలు మేము 50 లక్షలు ఉన్నాం అన్న జనాభా 1976 సంవత్సరం ముందు ఎంతమంది ఉన్నారనేది యావత్ తెలంగాణ తెలుసుకోవాల్సింది ఉంది. ఆదివాసి రిజర్వేషన్లు ఉద్యోగాలు ఏజెన్సీ ఫలాలు పొందుతూ మా ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారని అలా చేసే లంబాడిలను తరమికొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాస్ చర్ల జేఏసీ వైస్ చైర్మన్ వాసం ముసలయ్య ఆదివాసీ విద్యార్థి సంఘం జేఏసీ కో కన్వీనర్ ఇర్ప ప్రకాష్ దొర చర్ల జేఏసీ కోశాధికారి పూనెం వరప్రసాద్ బెండబోయిన మురళీకృష్ణ పున్నం రామకృష్ణ కోరం సూర్యనారాయణ శ్యామల రామారావు తుర్రం వీరభద్రం బందా స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :