D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా /కొత్తగూడ/ మే23(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లాకొత్తగూడ మండలం కర్నెగండి గ్రామానికి చెందిన మద్దెల పల్లవి (35) అనే మహిళ పాముకాటుకు గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు.ఘటన వివరాల్లోకి వెళ్తే..కర్నెగండి గ్రామానికి చెందిన మద్దెల పల్లవి గురువారం రోజున కూలీ పనుల్లో భాగంగా అడవికి తునికాకు సేకరణ కోసం వెళ్లారు. ఆ సమయంలో ఆకులను సేకరిస్తుండగా పొదల్లో ఉన్న ప్రమాదకరమైన పాము ఆమెను కాటు వేసింది. గమనించిన తోటి కూలీలు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం (MGM) ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ.. పాము విషం శరీరం అంతా పాకడంతో పరిస్థితి విషమించి పల్లవి ఈరోజు ఆసుపత్రిలోనే కన్నుమూశారు. మృతురాలికి భర్త సారయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అప్పటివరకు కళ్లముందే తిరిగిన తల్లి శవమై తిరిగిరావడంతో ఇద్దరు కుమారులు, భర్త సారయ్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి మరణంతో ఆ పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. పల్లవి మరణంతో కర్నెగండి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలి
.
Aksharam Telugu Daily