Saturday, 18 April 2026 06:43:53 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

విత్తనాల పేరు తో దోపిడి ...పుట్టగోడుల్లా పూట్టుకోస్తున్న కంపెనీలు

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 04 July 2025 03:11 PM Views : 559

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జులై 4 (అక్షరం న్యూస్ ) ఏజెన్సీ గంగారం మండలంలో కోమట్టగూడెం గ్రామంలో గిరిజనులు గిరిజనేతరులు వర్షాధార వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు ఈ ప్రాంతం పోటీ ప్రపంచంలో ఇంకా వెనుకబడి నట్లే కనిపిస్తుంది ఇక్కడి రైతులు ముఖ్యంగా వరి మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని విత్తన కంపెనీలు మోసానికి పాల్పడుతున్నాయి కొత్త కొత్త పేర్లతో వెలుస్తున్న విత్తన కంపెనీలు ప్రతీ సీజన్‌కి కొత్త బ్రాండ్లు పెట్టి ఆఫర్ల పేరిట బోనస్‌లు, టూర్లు బైకులు కార్లు చూపిస్తూ డిస్ట్రిబ్యూటర్లను ఆకర్షిస్తున్నారు ఈ కంపెనీలు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తున్నాయా లేదా అన్నది ప్రశ్నగా మిగులుతోంది పలువురు వ్యాపారస్తులు నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రతి ఏడాది పంట దిగుబడి రాక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు ప్రతీ సీజన్‌లో ఇలాంటివి పునరావృతం అవుతున్నా అధికారులు మిన్నకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు ఫర్టిలైజర్ విత్తన వ్యాపారులు ఇష్టం వచ్చినట్టు వ్యాపారం సాగిస్తున్నది బహిరంగ రహస్యంగా మారింది రైతులు విత్తనాలు కొనుగోలు చేయడానికి వ్యాపారుల వద్దకు వెళ్తే మార్కెట్లోకి కొత్తగా వచ్చినవంటూ చాలా దిగుబడి వస్తుందంటూ మాయమాటలు చెప్పి విక్రయిస్తున్నారు ఇలా మూడు పువ్వులు ఆరు కాయలు గా వ్యాపారం సాగుతోంది సరైన అవగాహన లేకుండా నమ్మి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు పంట దిగుబడి రాక నష్టపోతున్నారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపడి అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. కొత్త కొత్త పేర్లతో వస్తున్న విత్తన కంపెనీలు రైతులను మభ్యపెట్టి కోట్లు గడిస్తున్నాయి తీరుకొక్క పేరుతో మార్కెట్ లోకి వస్తున్న నకిలీ విత్తనాలు రైతులకు శఠగోపం పెడుతున్నాయి డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కంపెనీల గిఫ్టులు టూర్లలో తలమునకలై విలాసాలు అనుభవిస్తుంటే కొనుగోలు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారు. మొక్కజొన్న వరి జొన్న పెసర మినుముల వంటి పంటలకు సరైన దిగుబడి రాక ఆందోళన చెందుతున్నారు మరి ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖలు సకాలంలో సీజన్​ప్రారంభంలోనే తనిఖీలు చేపట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆగబోయిన రవి, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గం గారం మండలం లో కొంతమంది వ్యాపారులు గిరిజన రైతులను నకిలీ విత్తనాలతో మోసం చేస్తున్నారు నమ్మించి నట్టేట ముంచుతున్నారు. వ్యవసాయం తప్పా మరే దారి లేని రైతులు అప్పుల ఊబిలో మునిగి చివరకు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి చేరుకుంటున్నారు కొందరు దళారీలు, వ్యాపారులు లాభాలు గడిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలి

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :