AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ ఆగస్టు 2--- మండల కేంద్రం లోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయంలో శనివారం కొయ్యూరు ప్రాదమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ శ్రీదర్ నేతృత్వంలో వైద్య శిబిరం నిర్వహించారు. 25 మంది విద్యార్దులకు వైద్య పరీక్షలు నిర్వహించి చిరు వ్యాధులతో బాధపడుతున్న వారికి మందులను పంపిణీ చేసారు. రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులకు త్వరలో పరీక్షలను నిర్వహించి మందులను పంపిణీ చేస్తామని తెలియచేసారు. విద్యార్దులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి వ్యాదులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ రాంప్రసాద్ నిలయ కమిటీ అద్యక్షులు తాటి పాపారావు ఉపాద్యక్షులు జవ్వాది మురళీకృష్ణ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి ఆశా కార్యకర్త ఉషారాణి పాల్గొన్నారు.
Aksharam Telugu Daily