D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /తల్లాడ సెప్టెంబర్/ 4 (అక్షరంన్యూస్) తల్లాడ పీఎస్ పరిధిలోని ప్రజలకు సెప్టెంబర్ 13వ తేదీన మధిర కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ ఉందని దానిని సద్వినియోగం చేసుకోవాలని తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని రాజి చేసుకునేందుకు సెప్టెంబర్ 13 వరకు రెండు పార్టీలు కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసును పూర్తిగా క్లోజ్ చేయబడునని వెల్లడించారు. యాక్సిడెంట్ కేసులు, కొట్టుకున్న కేసులు, చీటింగ్ కేసులు చిట్ఫండ్, భూతగాదాలు కు సంబంధించిన కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్నచిన్న దొంగతనం కేసులు తదితర వాటిని ఈ లోకదాలత్ లో రాజి చేసుకుని కేసును క్లోజ్ చేసుకునే అవకాశం ఉందనీ, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు.
.
Aksharam Telugu Daily