Saturday, 19 September 2026 03:05:07 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బడిలో ఆగడాలు.. విద్యాబుద్ధులు నేర్పే చోట వ్యసనాల అడ్డా! జగన్నాథపురం పాఠశాల తాళాలు పగులగొట్టిన ఆకతాయిల చోరీ జరగలేదు.. బాధ్యులపై చర్యలు తప్పవన్న పోలీసు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 18 September 2026 07:59 PM Views : 74

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ములకలపల్లి /సెప్టెంబర్ 18 /అక్షరం న్యూస్: అక్షరాలు దిద్దించాల్సిన సరస్వతీ నిలయం రాత్రి కాగానే ఆకతాయిల అడ్డాగా మారుతోంది. మద్యం, మత్తు పదార్థాల మత్తులో కొందరు యువకులు బడులను తమ వికృత చేష్టలకు వేదికగా చేసుకుంటున్నారు.ములకలపల్లి మండలంలోని జగన్నాథపురం ప్రాథమిక పాఠశాలలో తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు గుర్తుతెలియని ఆకతాయిలు పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించి వీరంగం సృష్టించారు. ​శుక్రవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ప్రధానోపాధ్యాయుడు (హెచ్‌ఎం) స్టాఫ్ రూమ్ తాళాలు విరిగి ఉండటాన్ని చూసి విస్మయానికి గురయ్యారు. కంప్యూటర్ గది తాళాన్ని సైతం పగులగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఆనవాళ్లు కనిపించాయి. నిత్యం బడి ప్రాంగణంలో మద్యం సీసాలు, సిగరెట్ పీకలు దర్శనమిస్తున్నాయని, వ్యసనపరులు బడిని అడ్డాగా మార్చుకున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ​మత్తు కోరల్లో గ్రామాలు.. స్థానికుల ఆందోళన: చుట్టు పక్కల ప్రాంతాలైన పాల్వంచ, భద్రాచలం, అశ్వారావుపేట ప్రాంతాల్లో గంజాయి రవాణా ఎక్కువగా వెలుగుచూస్తున్న నేపథ్యంలో, మండలంలోని మారుమూల గ్రామాల్లోకీ ఈ మత్తు జాడ్యం విస్తరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ములకలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పరిసరాల్లో రాత్రివేళల్లో సిగరెట్లలో గంజాయి నింపి సేవిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మత్తులో యువకులు మితిమీరిన వేగంతో, సైలెన్సర్ల శబ్దాలతో ద్విచక్ర వాహనాలు నడుపుతూ రోడ్లపై హల్‌చల్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ​నిఘా పెంచుతాం.. కఠిన చర్యలు: ఎస్సై మధు ప్రసాద్ ఈ ఘటనపై ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్ మాట్లాడుతూ.. పాఠశాలలో ఎలాంటి దొంగతనం జరగలేదని, కేవలం ఆకతాయిలే తాళాలు పగులగొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. రాత్రివేళల్లో పాఠశాల ఆవరణలో మద్యం సేవిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు. గ్రామంలో పెట్రోలింగ్ ముమ్మరం చేసి, ఇలాంటి ఆకతాయి చేష్టలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :