AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/హుజురాబాద్ : కరీంనగర్/హుజురాబాద్/ ఆగస్టు 28/అక్షరం న్యూస్ : హుజురాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 16 అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను సీడీపీవో సుగుణ ప్రకటించారు. వచ్చే నెల సెప్టెంబర్ 1 నుండి 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. వెరిఫికేషన్ షెడ్యూల్ వివరాలు: సెప్టెంబర్ 1వ తేదీన: సైదాపూర్ మండలంలోని గొడిశాల-1, గొడిశాల-2, సైదాపూర్-1, సైదాపూర్-2 మరియు హుజురాబాద్ మండలంలోని శాలపల్లి అంగన్వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరు కావాలి. సెప్టెంబర్ 2వ తేదీన: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కుమ్మరివాడ, సైదాపూర్ మండలం దుద్దెనపల్లి-1, సర్వాయిపేట అంగన్వాడీ కేంద్రాల అభ్యర్థులకు వెరిఫికేషన్ ఉంటుంది. సెప్టెంబర్ 3వ తేదీన: హుజురాబాద్ మండలం గొల్లపల్లి, ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి, వీణవంక మండలం కొత్తపల్లి, జమ్మికుంట మండలం గోవిందాపూర్, నాగంపేట, మొల్లపల్లి, వడ్డెరవాడ అంగన్వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరు కావాలి. అభ్యర్థులు తమకు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు హుజురాబాద్ లోని కేసీ క్యాంపు, దమ్మక్కపేట రోడ్డులో గల సీడీపీవో కార్యాలయానికి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
.
Aksharam Telugu Daily