D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూలై 6(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని కాంగ్రెస్ నాయకుల అరాచకాలు అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తున్న గొంతుకల అణచివేతలపై పత్రిక విలేకరులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ ఈనెల 7న ప్రజా నిరసన కార్యక్రమం చేపట్టి తీరుతామని గంగారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఇర్ప సూరయ్య ఒక ప్రకటనలు తెలిపారు కాంగ్రెస్ నాయకుల వేధింపులకు నియోజకవర్గంలో ఇప్పటికీ ముగ్గురు బలిదానం అయ్యారు. ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు, పోలీసులు బెదిరింపులకు గురి చేసినందుకు గాను ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ చుక్క రమేష్ కుటుంబానికి అండగా గంగారం నుండి వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం తప్పు చేయని మంత్రి ధనసరి అనసూయకు భయమెందుకు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతి అక్రమలకు నిరసనగా ఈనెల 7న చేపట్టబోయే కార్యక్రమానికి పర్మిషన్ కోసం దరఖాస్తు చేయగా గంట వ్యవధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేయడం ప్రజాసామ్యాన్ని కూని చేయడమేననిఅని అన్నారు. మంత్రి సీతక్క భయంతోనే అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి సిటీ యాక్ట్ అమలు చేపించడం, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి సీతక్క, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజాస్వామ్య బద్దంగా గంగారం మండల ప్రజల స్వేచ్ఛ కోసం బిఆర్ఎస్ పార్టీ శాంతియుతంగా ప్రజా నిరసన కార్యక్రమం చేపట్టుతాం కాంగ్రెస్ నాయకుల అవినీతి పైన వార్తలు రాసిన పత్రికా విలేకరుల మీద భౌతికంగా దాడులు చేయడం జరిగిందని అన్నారు ఇసుక దందాలు అవినీతి అక్రమాలు భూ కబ్జాలు ప్రశ్నించిన వారి పైన దాడులు ములుగు నియోజకవర్గంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నవి అనర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పైరవీకారులకు బ్రోకర్లకు పర్సంటేజీలు ఇచ్చిన ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం సీతక్క మార్క రాజకీయం చేస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా వారియర్స్ ను,జర్నలిస్టులను వేధిస్తూ కేసులు పెడుతూ భౌతిక దాడులు చేస్తూ భయపెడుతున్న పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా ఈ నెల 7న ప్రజా నిరసన కార్యక్రమం ములుగు జిల్లాలో చేసి తీరుతామని అన్నారు సమ్మక్క సారలమ్మ ఉద్యమించినగడ్డ, తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ముఖ్యమంత్రిని తరిమికొట్టింది గుర్తుపెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు గంగారం మండల ప్రజలారా! గిరిజన దొరసాని గడిని బద్దలు కొట్టుకొని స్వచ్చందంగా ప్రజలు రోడ్డుమీద వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టాలని ఇర్ప సూరయ్య పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ నాయకులు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఆత్మ చైర్మన్లు, పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఆయన కోరారు..
.
Aksharam Telugu Daily