AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : * భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / ఏప్రిల్ 14 / అక్షరం న్యూస్ -:: బాబా సాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలను అహలే సున్నత్వల్ జామాత్ (ఏ.యస్.జే) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రకాష్ నగర్ లో గల జిల్లా కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు మహమ్మద్ కరీం ఖాద్రీ అధ్యక్షతన జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఏ.యస్.జే ఛైర్మన్ యం.ఏ.రజాక్ ముఖ్య అతిథిగా హాజరై బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఛైర్మన్ రజాక్ ప్రసంగిస్తు బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలనే ఈ దేశం లో ప్రజలందరికీ సమానత్వం వచ్చిందని, నేడు దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధం గా మైనార్టీలను ఈ దేశం లో రెండవ శ్రేణి పౌరులుగా చూపించే కుట్ర లో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లు ను రాజ్యాంగానికి విరుద్ధంగా సవరించిందని, బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టలను చేస్తుందని మండిపడ్డారు. బాబా సాహెబ్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైన సిద్ధం గా ఉన్నామని రజాక్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కరీం ఖాద్రీ, ఉపాధ్యక్షులు మహమ్మద్ గౌస్ మోహినుద్దీన్, ప్రథాన కార్యదర్శి షేక్ యఖుబ్ ఖాద్రీ, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అన్వర్ పాషా, మహమ్మద్ హుస్సేన్ ఖాన్, జిల్లా ట్రేజరర్ సయ్యద్ యఖుబ్ ఉద్దీన్, సెక్రటరీ జనరల్ మహమ్మద్ అలీం ఉద్దీన్, యూత్ వింగ్ అధ్యక్షుడు షేక్ నయీమ్, మహమ్మద్ ఉస్మాన్, అడ్వకేట్ మహమ్మద్ సాదిక్ పాషా తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily