Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పొట్టి శ్రీరాములు /నెల్లూరు : జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో నెల్లూరూ లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కాలేజీ ఛైర్మన్ వరదారెడ్డి అభినందించారు. కళాశాల స్థాపించినప్పటి నుంచి నేటి వరకు ప్రతి పోటీ పరీక్షలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి అటు రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ మంచిర్యాంకులు సాధించడం అభినందనీయం అని ఛైర్మన్ అన్నారు. ర్యాంకులు సాధించిన వారిలో వెంకట్ కౌశిక్ ఆల్ ఇండియా 141 ర్యాంక్, ఉజ్వల్ పుత్తూరు 509 వ ర్యాంకు, ప్రతాప్ రెడ్డి 3279,వెంకట్ మోహిత్ రెడ్డి 5836 ర్యాంక్, ప్రణీత్ కుమార్ 6998 ర్యాంకులు,సాధించారు. అలాగే ఈ విద్యా సంవత్సరానికి గాను 250 మంది విద్యార్థులకు గాను 70 మందికి పైగా విద్యార్థులు JEE అడ్వాన్స్ ఎగ్జామ్స్ కి అర్హత సాధించారు.మరియు పదివేల లోపు 25 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. విద్యార్థుల విజయానికి సంతోషాన్ని వ్యక్తపరిచిన చైర్మన్ వరద రెడ్డి, డైరెక్ట్ సంతోష్ రెడ్డి, సీఈవో సురేందర్ రెడ్డి, జిఎం రాజేంద్రప్రసాద్, డిజిఎం గోవర్ధన్ రెడ్డి, ఏపీ డిన్ అరవింద్,లు మాట్లాడుతూ..భవిష్యత్తులో మరింత అత్యుత్తమమైన ర్యాంకులు సాధించేల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చైర్మన్ వరద రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నెల్లూరు జోనల్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి, అకాడమిక్ డీన్ రాంబాబు, ఏజీఎం వెంకటేశ్వర్లు నాయుడు, ప్రిన్సిపల్స్, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు..
-
Aksharam Telugu Daily