D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : . ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 5 (అక్షరం న్యూస్) ఖమ్మం : ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలిచిన ఆర్య వైశ్య సర్పంచుల కు వార్డ్ మెంబెర్ లకు వర్తక సంఘ ఎన్నికలలో గెలిచిన ఆర్య వైశ్య నాయకులకు జూబ్లీ క్లబ్ లో ఎన్నికయిన ఆర్య వైశ్య నాయకులకు మరియు ఇతర ఆర్గనైసేషన్ లలో నియమితులైన ఆర్య వైశ్య నాయకులకు ఖమ్మం జిల్లా ఆర్య వైశ్య సంఘం తరపున ఘనంగా సన్మానం చేసినారు . ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పసుమర్తి సీతా చందర్రావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారని మాకెందుకులే రాజకీయాలు అని ఆలోచనలో ఉన్నారని ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్యవైశ్యులు రాజకీయాల్లోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందని అలా వచ్చినప్పుడు మాత్రమే సమాజానికి మనం చేయాల్సిన సాయం చేయగలుగుతామని ప్రతి ఒక్కరు కూడా మన ఆర్యవైశ్య రాజకీయ నాయకులు కొంజేటి రోశయ్య టీజీ వెంకటేష్ ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందుకు పోవాలని అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా పాలకవర్గం వనమా కిరణ్ కుమార్ , గోళ్ళ రాధాకృష్ణ మూర్తి , పాల్వయి వెంకటేశ్వర రావు , పాల్వాయి సీతయ్య , చారగుండ్ల లక్ష్మీ , నరసింహమూర్తి , జిల్లా మహిళ అధ్యక్షురాలు దోసపాటి సంధ్యా రాణి , పసుమర్తి గోపాలరావు , గంగిశెట్టి గంగాధర , జగదీష్ కుమార్ , చారుగుండ్ల నగేష్ కుమార్ , నూకల వాసు , వీరవెల్లి రాజేష్ మరియు ఖమ్మం జిల్లా ఆర్య వైశ్య సంఘం గౌరవ సలహాదారులు మాజీ అధ్యక్షులు మాజీ జిల్లా కార్యవర్గం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జులు జిల్లాలోని వివిధ విభాగాల కార్యవర్గాలు ఇతర కార్యవర్గం అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
.
Aksharam Telugu Daily