AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ ఆగస్టు 1---- మండలంలోని సుబ్బంపేట పంచాయతీ పరిధిలో గల బి ఎస్ రామయ్య నగర్ సమీపంలోని శుక్రవారం తెల్లవారుజామున ఇసుక లారీ ఢీకొని వన్యప్రాణి నక్క మృతి చెందింది. ఇసుక లారీ ఢీ కొనడం వల్ల నక్క యొక్క శరీర భాగాలు చిందరవందరగా అయిన్నాయి. సుబ్బంపేట పంచాయతీలో విచ్చలవిడిగా ఇసుక ర్యాంపులు ఉండడం వల్ల రోజుకు కొన్ని వందల లారీలు రై రై అంటూ పరుగులు తీస్తున్నాయి. ఈ ఇసుక లారీలు మనుషుల మూగ జీవాల ప్రాణాలను తీయడమే కాకుండా వన్యప్రాణుల ప్రాణాలను కూడా తీస్తున్నాయి. మండల కేంద్రంలోని ఇసుక లారీలు ఒక్కసారిగా పది పదిహేను లారీలు రై రై మంటూ పరుగులు తీయడంతో పాదచారుల వాహనదారుల కాళ్ళల్లో దుమ్ము పడి ప్రమాదాలు జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు వాపోతున్నారు. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపార దారులు లారీల వల్ల వచ్చే దుమ్ము ధూళి వల్ల వ్యాపారాలు సాగడం లేదని మనోవేదన చెందుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక లారీలను కట్టడి చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily