D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి/19 వైరా (అక్షరం న్యూస్) వైరా రిజర్వాయర్ సందర్శనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రెస్ కార్మిక చైర్మన్ కే శ్రీనివాసరెడ్డికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ ప్రాంతంలోని మిషన్ భగీరథ బోడెపుడి సుజల స్రవంతి మంచినీటి పథకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిజాం నవాబులు కట్టించిన వైరా రిజర్వాయర్ రైతులకు కల్పతరువు లాంటిదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్ కు కృష్ణ గోదావరి జలాలను అనుసంధానం చేయటం వలన సాగునీరు త్రాగునీరు అందించటంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు రైతులకు ఎంతో ఉపయోగకరం గా ఉంటుందని అన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణ గోదావరి జలాలు సాగు నీటి వినియోగంలో వాటాల వద్ద ఘర్షణలు లేకుండా వృధాగా పోతున్న నీటిని లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టి రైతులకు ఉపయోగపడే విధంగా కృషి చేయాలని కోరారు. నీరు ఉన్నచోటనే సంస్కృతి సంపద ఉంటుందనీ అన్నారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గోదావరి కృష్ణ జలాలను వినియోగించుకునేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా టీయూ డబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామనారాయణ రాష్ట్ర నాయకులు మాటేటి వేణుగోపాల్ ను జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సంఘం నాయకులు ఏపూరి రాజారావు, ఎక్కిరాల శ్రీనివాసరావు అక్కి శెట్టి రవితేజ, సూతకాని శ్రీకాంత్, గొల్లమందల విజయ్, దేవబత్తిని సీతారాములు, ప్రశాంత్, మహేష్, నాగరాజు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily