Jakkani Rajaramesh , SIRCILLA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల, జనవరి -30 (అక్షరం న్యూస్): సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు ఈసారి ఎన్నికల భారం తీవ్రస్థాయిలో పడనుందా..! తీవ్రంగా పోటీ ఉన్న వార్డుల్లో ఓటుకు మరింత డిమాండ్ పెరగనుందా..! ఖర్చు భారం ఎక్కువగా ఉండబోతుందా..! అనే ప్రశ్నలు వార్డు వార్డుకు వీధి వీధిలో వినిపిస్తున్నాయి. ఖర్చు భారం ఎవరు భరిస్తారో వారికే విజయం దక్కనుందా...! అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది... ఎన్నికలలో ఖర్చు పెట్టే లెక్క ప్రతిది అధికారులకు చూపెట్టాలనే నిబంధన ఉంది.. దీనిని పాటించకుండా తమ తీరు తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికలవేళలో మద్యం, డబ్బులు ఏరులై పారుతున్న పట్టించుకోకుండా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది... అయినా కూడా సంబంధిత అధికారుల తీరు మారడం లేదు.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టరాజ్యంగా వీధుల్లో "ఎన్నికల సరుకుల" పంపిణీ జరుగుతున్న పట్టించుకోకపోవడమే దీనికి కారణం.. ఇప్పటికే పలు వార్డుల్లో రాత్రి వేళలో సిట్టింగులు మొదలయ్యాయి... చీకట్లో మంతనాలు భుజగింపులు మొదలుకానున్నాయి. జనవరి 30వ తేదీ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో కౌన్సిలర్ గా పోటీ చేసే అభ్యర్థులు ఆశతో, ఉత్సాహంతో, ఉత్కంఠతతో తమ నామినేషన్ దాఖలు చేశారు. అయితే విజయం మాత్రం "లక్ష్మికటాక్షం" కురిపించిన వారికే దక్కుతుందా.. తేలాల్సి ఉంది.
.
Aksharam Telugu Daily