GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జగిత్యాల : రాయికల్, ఏప్రిల్ 01 అక్షరం న్యూస్ కొండగట్టు పాదయాత్రకు వెళ్తున్న ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామానికి చెందిన హనుమాన్ మాలధారణ స్వాములకు బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామ శివారులో TS21T3577గల ఆటో జగిత్యాల నుండి రాయికల్ వైపు వస్తూ జగిత్యాల వైపు వెళ్తున్న స్వాములను ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు స్వాములకు మోకాళ్ల వద్ద స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. స్వాములను డీకొట్టిన అనంతరం ఆటో పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొని ఆగిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై CH. సుధీర్ రావు, ఏఎస్సై దేవేందర్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేసుకుని గాయపడిన క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
.
Aksharam Telugu Daily