Sunday, 15 March 2026 08:15:39 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వ‌క్ఫ్ బోర్డు చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకాదు.... ముస్లింలపై కక్ష సాధింపులు బిల్లు సెక్యులర్ దేశంలో సాధింపు చట్టాల..

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 18 April 2025 06:05 PM Views : 1330

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / ఏప్రిల్ 18/ అక్షరం న్యూస్ - వ‌క్ఫ్ బోర్డు చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును తక్షణమే ఉప‌సంహ‌రించుకోవాల‌ని రుద్రంపూర్ ముస్లిం మ‌త పెద్ద‌లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ మజీద్-ఏ - క్యూబా లో చేతులకు నల్ల రిబ్బన్ పట్టిలు ధరించి ప్రార్థనలు చేశారు. అనంతరం మసీదు నుండి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సంద‌ర్భంగా మసీద్ ప్రెసిడెంట్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై కక్ష సాధింపు చర్యతో లౌకిక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇటువంటి మతోన్మాద చర్యలు చేపడుతుందన్నారు. కేంద్ర చ‌ర్య‌ల‌ను లౌకికవాదులు ఖండించాలని కోరారు. జమాతే ఇస్లామీ హింద్ సభ్యులు అబ్దుల్ భాషిద్ మాట్లాడుతూ..... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై కక్ష సాధింపు చర్యతో లౌకిక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇటువంటి మతోన్మాద చర్యలు చేపడుతుందన్నారు. కేంద్ర చ‌ర్య‌ల‌ను లౌకికవాదులు ఖండించాలని కోరారు. బిల్లును ఉపసంహరించుకోకపోతే ముస్లింలంతా ఉద్యమిస్తార‌ని తెలిపారు.... ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఐ ఎన్ టి యు సి కొత్తగూడం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ మాట్లాడుతూ....దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీల ఆస్తులకు రక్షణగా ప్రత్యేక వక్ఫ్‌ చట్టాన్ని రాజ్యాంగం అమలు చేసిందని, మోదీ ప్రభుత్వం ముస్లిం లను అణగదొకేందుకు ఈ చట్టాలనికి సవరణలు చేయాలని చూస్తున్నదని, దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సోను భాయ్, మొహమ్మద్ రఫీ, ఆలం, షమీమ్, మునవర్, అజార్, రహిమత్, ఖాసీం బాబా, షామిమ్ముళ్ళ, ఫహీం, రహీం, అరీఫ్,ఖాసీం, శుక్రు, సోహెల్, అక్రమ్, మదర్ సాబ్, తదితరులు ఉన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :