Monday, 15 December 2025 07:25:55 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి నష్టపరిహారం తక్షణమే చెల్లాంచాలి

పెద్దపల్లి నియోజకవర్గంలో 2627 ఎకరాల్లో పంట నష్టం... సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించిన పెద్దపల్లి ఎమ్మెల్యే


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 25 March 2025 08:59 AM Views : 693

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ మార్చి 25 అక్షరం న్యూస్ ఈనెల 21న కురిసిన అకాల రాళ్ళ వర్షం వడగండ్ల వాన పెద్దపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రైతులు పంట నష్టపోయారని వారికి తక్షణమే పంట నష్టపరిహారం అందించాలని అందుకు నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుట విజయరామణరావు హైదారాబాద్ లో అసెంబ్లీ హాల్లో సీఎం ఛాంబర్ లో సోమవారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పెద్దపల్లి నియోజకవర్గంలో పంట నష్టం రైతులకు పరిహారం చెల్లింపుపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేయడం జరిగింది పెద్దపల్లి నియోజకవర్గంలోని 2 మండలాల్లోని 11 గ్రామాల్లో 1035 మంది రైతులకు చెందిన వరిపంట దెబ్బతిందని, 6 మండలాల్లోని 28 గ్రామాల్లో 828 మంది రైతులకు చెందిన 1084 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు వర్షం వల్ల నష్టం వాటిల్లిందని సీఎంకు తెలిపారు అలాగే ఒక మండలంలోని గ్రామంలో 30 మంది రైతులకు సంబంధించి 20 ఎకరాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయని వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వ్యవసాయ అధికారులతో పంటనష్టం సర్వే చేయించి ప్రాథమిక అంచనా రూపొందించామని పేర్కొన్నారు తాను స్వయంగా పెద్దపల్లి నియోజక వర్గంలోని పంటపొలాలు మొక్కజొన్న చేన్లు కూరగాయల తోటలను పరిశీలించి పంట నష్టంపై అధికారులతో సమీక్షించానని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 1896 మంది రైతులకు చెందిన 2627 ఎకరాల్లో పంటలు నష్టపోయారని తెలిపారు పెద్దపల్లి నియోజకవర్గంలోని పంటనష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వాలని కోరారు ఇందుకు గాను దెబ్బతిన్న పంటలకు రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని సీఎంను ఎమ్మెల్యే కోరారు అవసరమైన మేరకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి రైతులను ఆదుకుంటామని అభయమిచ్చారని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. నష్టపరిహారం తక్షణమే అందేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు పంట నష్టపోయిన రైతులకు తొందరలోనే పరిహారం అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :