Sunday, 29 March 2026 05:00:22 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తెలంగాణ‌ను రెండేళ్ల‌లో దేశానికి రోల్‌మోడ‌ల్‌గా నిల‌బెట్టాం. --మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 02 February 2026 05:28 PM Views : 171

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : హైదరాబాద్, ఫిబ్రవరి 2, అక్షరం న్యూస్ తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది’అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం ఏర్పడిన వెంట‌నే ఆరు గ్యారంటీల అమ‌లుకు శ్రీ‌కారం చుట్టాం’అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఏ మార్పు కావాల‌ని తెలంగాణ ప్ర‌జ‌లు ప్ర‌జాప్ర‌భుత్వంపై విశ్వాసం ఉంచారో రెండేళ్ల‌లోనే ఆ మార్పు స్ప‌ష్టంగా చూపించి ప్ర‌జ‌ల విశ్వాసాన్ని న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమ‌వారం నాడు స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో ఆధునీక‌రించిన స‌మాచార పౌర‌సంబంధాల శాఖ వెబ్‌సైట్‌ను మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు.త‌మ ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టేనాటికి అన్ని రంగాల‌లోనూ మ‌రీ ముఖ్యంగా ఆర్ధికరంగంలో పెను సంక్షోభమ‌ని ఈ ప‌రిస్ధితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో ఒక్కోమెట్టు పేర్చుకుంటూ సంక్షోభం నుంచి గ‌ట్టెక్కుతూ అభివృద్ది, సంక్షేమాన్ని ప‌రుగులు పెట్టిస్తున్నామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్ర‌జా ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప్ర‌తి నిర్ణ‌యం ప్ర‌జ‌ల జీవితాల‌లో స్ప‌ష్టమైన మార్పున‌కు నాంది ప‌లుకుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వ్య‌వ‌సాయం, విద్య‌, వైద్యం, గృహ నిర్మాణం, స‌న్న‌బియ్యం, రేష‌న్ కార్డులు, ఉపాధి క‌ల్ప‌న వ‌ర‌కు అన్ని రంగాల్లో ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లు తెలంగాణ‌ను దేశానికి ఆద‌ర్శంగా నిలుపుతున్నాయ‌ని మంత్రి అన్నారు. ఈ మార్పుల‌ను ప్ర‌జ‌ల‌కు స‌మ‌ర్ధవంతంగా చేర‌వేయ‌డంలో ప్ర‌జా సంబంధాల శాఖ పాత్ర అత్యంత కీల‌కం.ప్ర‌స్తుత ప‌రిస్ధితుల‌కు అనుగుణంగా సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని విరివిగా వాడుకొని ప్ర‌భుత్వం చేప‌డుతున్న అభివృద్ది సంక్షేమ ప‌ధ‌కాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వేగ‌వంతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని స‌మాచార శాఖ అధికారుల‌కు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ప్ర‌భుత్వ పాల‌న‌ను రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెట్టాం. రెండేళ్ల కాలం మ‌రీ తక్కువే కానీ ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అత్యద్భుతం. రాష్ట్రంలో ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం ఏర్పడిన వెంట‌నే ఆరు గ్యారంటీల అమ‌లుకు శ్రీ‌కారం చుట్టాం’అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.‘ఎన్నిక‌ల్లో హామీలు ఇవ్వ‌క‌పోయినా ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప‌లు ప‌ధ‌కాల‌ను అమ‌లు చేశాం. వ్యవ‌సాయ‌, పారిశ్రామిక రంగాల‌లో గ‌ణ‌నీయ‌మైన ప్రగ‌తిని సాధిస్తున్నాం. ఆర్ధికవృద్దిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్ధానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది’అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఒక‌వైపు ప్రపంచ న‌గ‌రాల‌తో పోటీ ప‌డే ల‌క్ష్యాల‌ను నిర్ధేశించుకొని మ‌రోవైపు పేద‌ల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫ‌లాలు అందిస్తూ, ద్విముఖ వ్యూహంతో మా ప్రభుత్వం పాల‌న సాగిస్తోంది. పాల‌న‌లో పార‌ద‌ర్శక‌త‌, అభివృద్దిలో ఆధునిక‌త‌, సంక్షేమంలో స‌రికొత్త చ‌రిత్రను రాస్తూ తెలంగాణ‌ను రెండేళ్ల‌లో దేశానికి రోల్‌మోడ‌ల్‌గా నిల‌బెట్టాం’అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐ&పిఆర్ క‌మీష‌న‌ర్ సిహెచ్‌. ప్రియాంక‌, ముఖ్య‌మంత్రి సీపీఆర్‌వో జి. మ‌ల్సూర్‌, స‌మాచార శాఖ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ డిఎస్ జ‌గ‌న్ , జాయింట్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ త‌దిత‌ర అధికారులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :