AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల అక్టోబర్ 14/ అక్షరం న్యూస్/ ----బీజాపూర్ లో భద్రతా దళాలు సైనికులను లక్ష్యంగా చేసుకొని నక్సలైట్లు దాచిపెట్టిన పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ లో భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి. కర్రెగట్టు అడవి ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు దాచిపెట్టిన పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో 51 లైవ్ బి జి యల్ లు 100 హెచ్ టి అల్యూమినియం వైర్ కట్టలు మరియు అనేక ఇతర పదార్థాలు ఉన్నాయి. భద్రత బలాలను లక్ష్యంగా చేసుకొనే నక్సలైట్లు ఈ కుట్రను పన్నారు.తడ్పల పేస్ క్యాంపు నుండి కోబ్రా 206 సిఆర్పిఎఫ్ 229 153 మరియు 196 జవానులు సంయుక్త బృందం కర్రెగట్టు ప్రాంతంలో సోదాలు నిర్వహించింది. ఈ ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు దాచిపెట్టిన పేలుడు పదార్థాలు మరియు పేలుడు పదార్థాల గారికి సంబంధించిన సామాగ్రిని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 51 లైవ్ పేలుడు పదార్థాలు 100 బండిల్స్ హెచ్ టి అల్యూమినియం వైరు 50 స్టీల్ పైపులు, పెద్ద మొత్తంలో విద్యుత్ వైర్లు ఇనుప షీట్లు మరియు 40 ఇనుప ప్లేట్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
.
Aksharam Telugu Daily