CHANDRAGIRI VAMSHIKRISHNA,:KESAMUDRAM, :MAHABUBABDReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కేసముద్రం : . మహబూబాబాద్ /కేసముద్రం /ఆగస్టు 7/అక్షరం న్యూస్ :- కేసముద్రం మండలం పలు రైళ్ల హల్టింగ్ మరియు గతంలో హాల్టింగ్ ఉన్న రైళ్లను పునరుద్ధరణ చేయాలని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రణ్వీత్ సింగ్ ని కలిసిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్. గురువారం ఢిల్లీలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు,వారు ఎంపీ బలరాం నాయక్ ని కలిసి కేసముద్రం మండలం పలు రైళ్ల హల్టింగ్ మరియు గతంలో హాల్టింగ్ ఉన్న రైళ్లను పునరుద్ధరణ విషయం గురించి చర్చించారు. అనంతరం ఎంపీ బలరాం నాయక్ తో నాగేశ్వరావు కలిసి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రణ్వీత్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.గతంలో కేసముద్రం రైల్వేస్టేషన్లో హాల్టింగ్ కలిగి ఉండే బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్,పద్మావతి ఎక్స్ప్రెస్ (అప్),కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్,సాయినగర్ షిర్డీ అప్,సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్పెస్,మణుగూరు ఎక్స్పెస్, మచిలీపట్నం ఎక్స్పెస్ లను పునరుద్ధరించాలని కోరారు.అదే విధంగా ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగునంగా నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్,ఇంటర్సీటీ ఎక్స్ ప్రెస్ ఈ రెండు రైళ్లు కేసముద్రంలో హాల్టింగ్ ఇప్పిస్తే హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణీలకు సౌకర్యంగా ఉంటుంది అని అన్నారు.రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరణ చేయాలని రైల్వే శాఖ సహాయ మంత్రినీ కోరారు.
.
Aksharam Telugu Daily