GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/ఏప్రిల్-13(అక్షరం న్యూస్) ఆదివారం పూట ఆ ఇంట సిరులు కురిశాయి. అయితే అది ధన రూపంలో కాదు.. సంతానం రూపంలో.. అవును! సంతానం కూడా సంపదేనని మన పూర్వికులు ఏనాడో అన్నారు. తాజాగా ఓ మహిళ కాన్పు కోసం దవాఖానాకు వెళ్తే.. ఏకంగా ముగ్గురు శిశువు లకు ( ట్రిప్లెట్స్) జన్మనిచ్చింది. ఒకేసారి తమ ఇంట సంతాన లక్ష్మి వరాలు కురిపించడంతో ఆ తల్లీదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఈ సంఘటన ముస్తాబాద్ మండల కేంద్రం లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే. .ముస్తాబాద్ మండలం చిప్పల పల్లి గ్రామానికి చెందిన పోడెండ్ల సృజన మహేష్ దంపతులకు మొదటి కాన్పులో పాప జన్మించింది తరువాత.కాలక్రమంలో సృజన మళ్ళీ ప్రెగ్నెన్సీ కావడంతో ముస్తాబాద్ మండల కేంద్రం లోని గత 37 సంవత్సరాలుగా డా॥ ఎరవెల్లి చంద్రశేఖర్ రావు - డా॥ఎరవెల్లి అనురాధ ల ఆధ్వర్యంలో ఎన్నో వైద్య సేవలు అందిస్తున్న శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ లో రెగ్యులర్ చెకప్ చేయించుకునేది. డెలివరీ సమయం కావడం తో పరీక్షలు చేసిన వైద్యులు సాధారణ కాన్పు సాధ్యం కాకపోవడం తోశస్త్రచికిత్స చేసి ప్రసవం చేయగా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు లో ఒక బాబు, ఇద్దరు పాపలు పుట్టడం విశేషం.ఈ సందర్బంగా హాస్పిటల్ లో ఒకే కాన్పులో ముగ్గురు శిశివులు జన్మించడం.. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటం సంతోషకరమన్నారు. కాన్పుకు సంబంధించి శస్త్ర చికిత్సలో ప్రసవం చేసిన డా॥ టి. స్రవంతి - డా॥ శ్రీకాంత్ లను పిల్లల తల్లిదండ్రులు,బంధువులు డాక్టర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. పుట్టిన ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబంతా సంతోషంలో మునిగిపోయారు..ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ ఇలాంటి ప్రసవాలు అరుదుగా జరుగుతుంటా యని తెలిపారు శిశువు ల్లో ఒకరు 1.4 మరొకరు1.4 ఇంకొకరు1.4 కిలోలు ఉన్నారని ఆరోగ్యం గా ఉన్నారని మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి అన్నారు
.
Aksharam Telugu Daily