Wednesday, 04 March 2026 01:50:09 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కౌన్సిలర్ గా పోటీకి మద్దతు తెలిపిన ఎంపీ ఈటెల పెద్దపల్లి 17వ వార్డ్ లో బిజెపి జెండా ఎగరవేస్తున్నట్లు ధీమా ఈటెల మద్దతుతో బిజెపి కార్యకర్తల్లో ఉత్సాహం

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 12 January 2026 01:16 PM Views : 270

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జనవరి 11 అక్షరం న్యూస్ రాష్ట్రంలో రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో బిజెపి అత్యధిక స్థానాలు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు బిజెపి మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, పెద్దపల్లి పట్టణానికి చెందిన 17 వ వార్డ్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి జెట్టి రాజు ఇతర బీజేపీ నాయకులు ఆదివారం రోజున హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్బంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు పాలించిన బిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు చేసిందేమి లేదని. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ. ప్రజలను మోసం చేయడంలో పార్టీల నాయకులు అబద్ధపు ప్రచారాలతో మున్సిపల్ ఎలక్షన్లో ఓటు కోసం ప్రజల వద్దకు వస్తారని అన్నారు. మున్సిపల్ ఎలక్షన్లలో బిజెపి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు అనంతరం పెద్దపల్లి పట్టణ 17వ వార్డు బీజేపీ అభ్యర్థి జెట్టి రాజును ఎంపీ ఈటెల రాజేందర్ శాలువాతో సత్కరించి బిజెపి జెండా ఎగరవేయాలని ఆకాంక్షించారు. జెట్టి రాజు స్పందిస్తూ తమ 17వ వార్డులో బీజేపీ గెలుపే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఈటెల రాజేందర్ తో ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కలవేణి స్వామితో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :