GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జనగామ/రఘునాథపల్లి : జనగామ జిల్లా/ రఘునాథపల్లి /( అక్షరం న్యూస్) ఏప్రిల్ 17: ఈ నెల 27వ తేదీన జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని బిఆర్ఎస్ పార్టీ స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వై.కుమార్ గౌడ్ కోరారు. గురువారం సన్నాహక సమావేశాలలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి, క్లస్టర్ ఇంచార్జ్ కొర్ర రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిపారు, అనంతరం మండలంలోని కుసుంబాయి తండా, యాపలగడ్డ తండాలో గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి చేసిన సేవలను ప్రజలు మరొకసారి గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. అందువల్ల సభకు అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ ముసి పట్ల విజయ్, ,లోక్కుంట్ల శృజన్, తిప్పరపు రమ్య, తిప్పరపు మమత, ముప్పిడి సాంబ, గూగులోతు హరినాయక్, పెంటతల మహేందర్ రెడ్డి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily