Sunday, 05 July 2026 12:57:06 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

విద్యా ప్రమాణాల పెంపుకు ప్రత్యేక కార్యాచరణ అమలు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 04 July 2026 05:09 PM Views : 17

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జూలై 04 అక్షరం న్యూస్ జిల్లాలో విద్యా విద్యా ప్రమాణాల పెంపుకు పటిష్టమైన కార్యాచరణను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రాథమిక ఉపాధ్యాయుల డీఆర్‌పీ బృందం సమీక్ష సమావేశంలో గత సంవత్సరం మాదిరిగానే ఈ విద్యా సంవత్సరంలో కూడా ప్రాథమిక స్థాయి విద్యార్థుల తరగతి వారీ అభ్యాస సామర్థ్యాలను పెంపొందించేందుకు రూపొందించిన వార్షిక విద్యా ప్రణాళిక అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, పాఠశాల స్థాయి సమీక్షలను క్రమం తప్పకుండా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం సమర్థవంతంగా అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో విద్యార్థుల నమోదు అధికంగా ఉన్న ఐదు ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను ప్రతి నెల సమీక్షిస్తూ, అవసరమైన మెరుగుదల చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఎంపిక చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, విద్యా ప్రమాణాల పెంపు, సమర్థవంతమైన బోధన, అభ్యాస ఫలితాల మెరుగుదలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రూపొందించిన వార్షిక విద్యా ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసి ప్రతి విద్యార్థి అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరిచే దిశగా అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి శారద, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ షేక్, అలోకిట్ పర్యవేక్షకులు, ప్రాథమిక స్థాయి డీఆర్‌పీ బృందం సభ్యులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :