AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 9/ అక్షరం న్యూస్/----ప్రజా కవి పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జయంతి ని పురస్కరించుకొని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం నందు తెలుగు విభాగం వారిచే కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగు భాష అధ్యాపకులు కొంగూరి ప్రదీప్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు నిరంతరం ఉద్యమ జీవి అని తన కాలంలో అనా అనేక ఉద్యమాలలో పాల్గొన్నారని ఆయన అన్నారు. రజకారులను ఎదిరించి జైలు జీవితం గడిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు పోరు చేశారు. తన కోసం కాకుండా ఇతరుల బాగు కసం పోరాడే తత్వం సామాజిక స్పృహ ఆయనకు కాలేజీ రోజుల నుంచే ఉన్నాయి. వారి త్యాగాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు కాళోజీ నారాయణరావు దాశరధి కృష్ణమాచార్యులు రంగాచార్యులు పీవీ నరసింహారావు బమ్మెర పోతన ల వేషధారణతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వర్మ రాజు వైస్ ప్రిన్సిపాల్ ఎం వి ఎల్ నరసింహారావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రమాదేవి బోసు బాబు క్రాంతి కుమార్ సునీత శ్రీధర్ బాబు లావణ్య చైతన్య శ్రావణి సంగీత విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily