CHANDRAGIRI VAMSHIKRISHNA,:KESAMUDRAM, :MAHABUBABDReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కేసముద్రం : మహబూబాబాద్/కేసముద్రం /ఆగస్టు 10/అక్షరం న్యూస్ :- క్రిమిసంహారక మందు త్రాగి వ్యక్తి మృతి చెందిన ఘటన తాళ్లపూసల పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కేసముద్రం ఎస్ఐ మురళి దర్ రాజు తెలిపిన వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి .తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన వలసాని మురళి తండ్రి ఐలయ్య, 39 సం,లు కులం (యాదవ,)కూలి, అను వ్యక్తి గత కొంతకాలంగా మధ్యానికి బానిసై తరచు తన భార్య రేణుక తో గొడవ పడుతూ చనిపోతాను అని బెదిరించే వాడు అని శనివారం మురళి వాళ్ళ అక్క వచ్చి రాఖీ కట్టిన అనంతరం మురళీ యొక్క భార్య రేణుక తన తల్లి వారింటికి రాఖి కట్టడానికి వెళ్ళినది. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న మురళి బాగా మద్యం సేవించి మద్యం మత్తులో గ్రామ శివారులోనీ చెరువు కట్ట వద్ద గల మల్లన్న గుడి వద్ద శనివారం ఉదయం 11.00 గంటలకు గడ్డి మందు త్రాగి పడిపోగా కాలేరు వెంకన్న చూసి మురళి యొక్క అన్న యాకన్నకు ఫోన్ చేసి చెప్పగా వారు వెంటనే 108 అంబులెన్స్ లో మహబూబాబాద్ ఆసుపత్రి కు తీసుకెళ్లి, అక్కడి నుండి ఎంజీఎం వరంగల్ కి తీసుకువెళ్లి చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11.00 గంటలకు చనిపోయినాడు అనీ మురళి యొక్క అన్న యాకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనది. అని కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజ్ ఈ సందర్భంగా తెలిపారు.
.
Aksharam Telugu Daily