Saturday, 18 April 2026 02:10:31 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రజలకు మరింత చేరువగా సాగుతున్న జన హిత పాద యాత్ర. ప్రభాత్ పేరి. మరియు శ్రమదానం.

ప్రబుత్వ పధకాల పై సర్వత్ర ప్రశంసలు. మహిళల స్పందన అమోఘం, ప్రజల్లో దూసుకెళుతున్న మీనాక్షి నటరాజన్. కార్యకర్తల్లో కనబడుతున్న జోష్.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 03 August 2025 08:39 PM Views : 736

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / నిజామాబాద్ /ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా / అర్ముర్ / ఆగష్టు 3 / అక్షరం న్యూస్ : - తెలంగాణ ఇంచార్జ్ ఏ. ఐ. సి. సి కార్యదర్శి కుమారి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రధ సారధి మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి సీతక్క ఏ. ఐ సి. సి కార్యదర్శి సంపతన్న, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ అజ్మాతుళ్ళ హుస్సేని , కాంగ్రెస్ కార్యకర్తల తో నిజామాబాద్ జిల్లా అర్ముర్ పట్టణంలో ఆదివారం రోజు జన హిత పాద యాత్ర నిర్వహించగా జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్షులు మహ్మద్ అయూబ్ ఈ యాత్రకు ముందు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ అజ్మాతుళ్ళ హుస్సేని, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి శ్రమ దానం నిర్వహించి పట్టణ వీదులను శుబ్ర పరిచారు. ఈ సంధర్భంగా మహ్మద్ అయూబ్ మాట్లాడుతూ జనహిత పాదయాత్ర ముఖ్య ఉద్దేశ్యం, ప్రబుత్వ పధకాలైన ఉచిత విధ్యుత్, ఉచిత బస్సు, కల్యాణ లక్ష్మి, సన్న బియ్యం, ఉచిత గ్యాస్, రేషన్ కార్డు, పెన్షన్స్, రైతు రుణమాఫీ, ప్రజల వరకు సక్రమంగా చేరుతున్నాయా లేదా అనే విషయాలను దృవీకరిస్తూ, ప్రజలకు ఎదురవుతున్న ఇతర ఇబ్బందులను స్వయంగా పరిశీలించి, ప్రబుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నాలు చేయడమే జన హిత పాదయాత్ర ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. ప్రజలకు పాలనా కు మధ్య వారధి గా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశలో ప్రయత్నాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన ఈ పాదయాత్ర కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ముఖ్యంగా మహిళలు పాదయాత్ర లో పాలుపంచుకోవడం అభినందనీయమని అన్నారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆగ్ర నాయకులు యాత్ర లో భాగస్వామ్యులవడంతో కార్యకర్తల్లో మంచి జోష్ కనబడుతుందని తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :