D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ జనవరి/ 3 వైరా (అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీ పరిధిలో నేడు 20 వార్డుల నందు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేయుచున్న వైరా ఎమ్మెల్యే మాలోతూ రాందాస్ నాయక్ పర్యటన విజయవంతం చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కట్ల సంతోషక ప్రకటనలో తెలియజేశారు. దాదాపు మున్సిపాలిటీ పరిధిలో 25 కోట్లతో వైరా అభివృద్ధి ప్రదాత మాలోతూ రాందాస్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులను మంజూరు చేయించారని గతంలో ఎన్నడూ జరగని విధంగా వైరా మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో నిధులను మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ విశేష కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. కావున నేడు చేపట్టబోయే పర్యటనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు వైరా మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని 20 వార్డుల నందు శంకుస్థాపన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన తెలియజేశారు.
.
Aksharam Telugu Daily