D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూన్ 10(అక్షరం న్యూస్) గంగారం మండలం బావురుగొండ నర్సిగూడెం గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులను మంగళవారం జిల్లా ఆర్డివో కృష్ణ వేణి సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ సమస్యల పరిష్కారించేందుకు ఈసదస్సులో రైతులు పాల్గొని తమ భూసమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు గతంలో తమ పరిధిలో లేని అనేక సమస్యలకు కోత్త చట్టం లో అనేక మార్గాలు ఉన్నాయన్నారు సులభంగా క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు జరుగుతున్నాయని జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం ముందస్తుగా సమాచారం అందించి సదస్సుల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ఆర్డివో వెంట తహశీల్దార్ బి బాలకిషన్ డిప్యూటీ తహశీల్దార్ రవి ఆర్ఐ డి శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్ రవీందర్ జూనియర్ అసిస్టెంట్ దుర్గం రవీందర్ రాధాకృష్ణ నాగేశ్వరరావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily