D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/వైరా/ఆగస్ట్/ 29 (అక్షరంన్యూస్) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం 2024 నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు సేవా పతకాలలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అందించిన అత్యుత్తమ సేవలకు గాను వైరా ఏసిపి ఎం అబ్దుల్ రహమాన్ ఉత్తమ సేవ పతకం, పి సత్యనారాయణ అవార్డులు అందుకున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మరో నలుగురు పోలీసు అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకాలు దక్కాయి. సేవాపతకం పొందిన వారిలో బి.వెంకటరమణారావు (ఏఎస్సై), జె.వెంకటేశ్వర్లు (ఏఎస్సై), ఎన్.వెంకట రెడ్డి (ఏఎస్సై), మహోన్నత సేవ పతకం సాధించిన సయ్యద్ హుస్సేన్ (హెడ్ కానిస్టేబుల్)వున్నారు.ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతులమీదుగా అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily