GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఆగస్ట్ -08(అక్షరం న్యూస్ ) పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తతోపాటు బాధ్యతగా వ్యవహరించాలని ముస్తాబాద్ ఎస్ ఐ జ్యోతి అన్నారు.శనివారం ముస్తాబాద్ మండలం రామలక్ష్మణ పల్లి గ్రామ శివారులో ద్విచక్ర వాహనం నడుపుతున్న మైనర్ బాలుడి ని చూసి. ఆపారు. బాలునికి కౌన్సిలింగ్ చేశారు ఈ సందర్బంగా ఎస్ ఐ సరదా కోసం ద్విచక్ర లేదా ఇతర వాహనాలు నడిపితే ప్రమాదాలబారిన పడే అవకాశం ఉందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానులు, తల్లిదండ్రులపై కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా భారీ జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి వాహనాలు ఇవ్వొద్దని ఎస్ ఐ సూచించారు.
.
Aksharam Telugu Daily