AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్ / ఏప్రిల్ 6/ అక్షరం న్యూస్:మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భ దినోత్సవ వేడుకలను సోమవారం అంబేద్కర్ విగ్రహం వద్ద బిజెపి మండల అధ్యక్షుడు చిలువేరు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు అనంతరం బిజెపి పార్టీ జెండాను ఆవిష్కరించి నాయకులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఏర్పడి 46 వసంతాలు పూర్తిచేసుకుని 47 వసంతంలోకి అడుగుపెట్టిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశం అన్నారు ఈ గొప్ప దేశంలో భారతీయ జనతా పార్టీ తన వంతు పాత్రగా పేద ప్రజలకు ఎల్లప్పుడు సేవలు చేయాలని సంకల్పంతో నరేంద్ర మోడీ నాయకత్వంతో ముందుకు సాగుతూ ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పిల్లలమర్రి రాములు, ప్రధాన కార్యదర్శి గరిడే కిషన్,పూరీల దిలీప్, సముద్రల శ్రీనివాస్,ఓర్పుల శ్రీనివాస్, చొప్పరి సదానందం, దుస్సా సాయి, తిప్పని నరేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily