Sunday, 13 July 2025 01:01:17 PM

వృక్షాలు నరకడం*.. *కోన కార్పస్ మొక్కలు తొలగించకపోవడం*.. *వ్యర్ధాలు గ్రామంలోనే దహనం చేయడం*.. *వ్యర్ధాలను డంప్ హౌస్ ఉండగా అక్కడకు తరలించకుండా చెరువుల

గ్రామ పంచాయతీ అధికారి తీరు*.. *జిల్లా అధికారులు ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాలి*.. *కోరుతున్న ప్రజలు*


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 13 March 2025 03:03 PM Views : 1097

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * *.. *ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్/ మార్చి తల్లాడ 13 (అక్షరంన్యూస్)* తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, కోనో కార్పస్ మొక్కలతో హాని జరుగుతుందని వాటిని తొలగిస్తామని ఈవో సుమారు సంవత్సరం క్రితం స్టేట్మెంట్ ఇచ్చి ఇంతవరకు తొలగించలేదు, డివైడర్లపై సూచిక బోర్డులు, ఏర్పాటు చేశారు. కానీ అవి ధ్వంసం అయ్యాయి. వాటిని పునరుద్ధరించలేదు, గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న వృక్షాలను అభివృద్ధి పేరుతో నరికి వేయడం పర్యావరణానికి ముప్పు కలిగించడం, పర్యావరణానికి హాని కలిగించారు, డంపింగ్ యార్డ్ కు తరలించాల్సిన చెత్తాచెదారాలను డంపింగ్ యార్డ్ కి తరలించకుండా చెరువుల్లో డంపు చేసి చేతులు దులుపుకుంటున్నారు, చెత్తాచెదారాలను బయటకు తరలించకుండా గృహ సముదాయాల మధ్యలోనే దగ్ధం చేస్తున్నారు, డ్రైనేజీలలో మురిగినీరు చేరి పందులు బోర్లతో దోమలు అభివృద్ధి చెందుతూ, ప్రజల రోగాల పాలవుతున్నారు, ఇవి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, అని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామపంచాయతీ పరిపాలన పరిపాలన సక్రమంగా చేయాలని వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ లోనే వేయాలని, వృక్షాలను నరికి పర్యావరణాన్ని దెబ్బతీసిన కార్యదర్శి పై తగిన చర్య తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :