AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : సుల్తానాబాద్ /పెద్దపల్లి మే12 (అక్షరం న్యూస్) సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని పెద్ద చెరువు ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడం కోసం మంగళవారం బొంతకుంటపల్లి మరియు గర్రెపల్లి గ్రామాల మధ్యలో ఉన్న ఎల్లమ్మ కాల్వ కూడిపోయి కబ్జాకి గురికావడంతో అధికారులు మరియు స్థానిక నాయకులతో కలిసి కాలువను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి కబ్జాకి గురైన కాలువను సర్వే చేసి పూడిక తీసి 5 గ్రామాల రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, విజయరమణ రావు గారు మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తున్నామని రైతులకు అవసరమైన సాగునీటి విషయంలో ఎలాంటి రాజీ పడేది ఉండదని తెలిపారు. రైతులకు సాగునీటి సరఫరా చేసే కాలువలను ఎవరైనా అన్యాక్రాంతం చేస్తే ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి కాలువలను ఎల్లవేళలా పరిరక్షిస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని గుర్తు చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి సందేహాలు లేవని నిండు ఎండా కాలంలో కూడా నియోజకవర్గ రైతన్నలకు అవసరానికి మించి సాగునీరందించామని తెలిపారు. గతంలో అధికారంలో లేనప్పటి నుండి రైతుల కోసం కోట్లాడిన నైజం తనదని గతంలో తాను శాసనసభ్యులుగా లేనప్పుడు గత పాలకులు రైతులకు సాగునీటి సరఫరాలో ఇబ్బందులకు గురిచేస్తే నిరసనగా ఎస్సారెస్పీ గేట్లను బద్దలు కొట్టి రైతులకు వెన్నుదన్నుగా ఉన్న నెపంలో తన మీద అప్పటి పాలకులు కేసులు పెట్టిస్తే నిన్న సోమవారం రోజున కోర్టుకు కూడా హాజరు అవడం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కార్ మరియు తాను ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు పలు గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily