D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా గంగారం జూలై 26 (అక్షరం న్యూస్) మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని కోమట్లగూడెం కాటినాగారం గ్రామాల మధ్యలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాళలేక, వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ డైవర్షన్ దెబ్బతినడంతో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులకు అత్యవసర సేవలు అన్నీ నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం అప్రమత్తమై వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల పై దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు బ్రిడ్జి పనుల కోసం ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు వరుసగా కురిసిన వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్నది. ప్రవాహం తీవ్రంగా ఉన్నందున, డైవర్షన్ రిపేర్ పూర్తయ్యే వరకు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గంగారం ఎస్సై రవికుమార్ ఎంపీడీవో మున్వర్ బేగ్ తెలిపారు. ప్రజల భద్రత దృష్టిలో పెట్టుకుని అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచించారు. తాత్కాలిక మరమ్మతులు పూర్తయ్యే వరకు సహకరించాలని మండల అధికారులు విజ్ఞప్తి చేశారు.
.
Aksharam Telugu Daily