AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / , జనవరి 14 / అక్షరం న్యూస్ -: ప్రతి అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని ప్రజల హక్కుల కోసం నిర్భయంగా పోరాడుతున్న దినపత్రిక అక్షరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఏం ఎల్ ఏ కునంనెని సాంబశివరావు కొనియాడారు. ప్రజల సమస్యలను నిక్కచ్చిగా వెలుగులోకి తెస్తూ, వినూత్న కథనాలతో సమాజాన్ని చైతన్యపరుస్తున్న అక్షరం దినపత్రిక ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని ఆయన అన్నారు. నిత్యం వినూత్న కథనాలు ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక వార్తలతో అక్షరం దినపత్రిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుందని కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రభుత్వం–ప్రజల మధ్య వారధిగా నిలుస్తూ ప్రజాపక్షన ప్రజా స్వరాన్ని బలంగా వినిపిస్తున్న అక్షరం పాత్ర అభినందనీయమని ఏం ఎల్ ఏ పేర్కొన్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి సమాజంలో మార్పుకు దోహదపడే వార్తలతో పాటు విలువైన సమాచారాన్ని అందిస్తూ తెలంగాణ రాష్ట్ర మంతట అన్ని జిల్లాలలో అక్షరం తెలుగు దిన పత్రిక తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందని తెలిపారు. ఈ సందర్భంగా అక్షరం దినపత్రిక రూపొందించిన 2026 ఆంగ్ల క్యాలెండర్ను బుధవారం కొత్తగూడెం ఏం ఎల్ ఏ కునంనెని సాంబశివరావు సిపిఐ కార్యాలయం శేషగిరిభవన్'లో ఆవిష్కరించారు. ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అక్షరం పత్రిక ప్రయాణం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అక్షరం దిన పత్రిక ఎడిటర్ మరియు ఛైర్మెన్ షేక్ యాకుబ్ పాషా తో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా , సిపిఐ పార్టీ కార్యాలయ ఇంచార్జ్ సుధాకర్, భద్రాద్రి జిల్లా విలేకరులు, సీనియర్ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily