P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి అక్టోబర్ 31 (అక్షరం న్యూస్) ఓదెల గ్రామంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జన్మదినం పురస్కరించుకొని ఓదెలలో 2కె రన్ పోత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా రెండు కిలోమీటర్ల రన్నింగ్ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న గుజరాత్లోని నదియార్ లో జన్మించారని ఆయన ఒక భారత స్వతంత్ర సమరయోధుడు. రాజా నితిజ్ఞుడు. అని అన్నారు భారతదేశపు మొట్టమొదటి ఉప ప్రధానిగా హోం మంత్రిగా పదవులను అలంకరించాడని భారతదేశం స్వతంత్ర తర్వాత అనేక స్వదేశీ సంస్థలను భారతదేశంలో వినడం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలకపాత్ర పోషించారని దీనివలన ఆయనకు భారతదేశపు ఉక్కుమనిషి అని కూడా పేరు వచ్చిందని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంగ్లాండ్ లో బారిష్టర్. పట్టా పొందాడని అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చి భారత జాతీయ ఉద్యమంలో పాల్గొన్నాడని భారత స్వతంత్ర పోరాటం లో పాత్ర పౌర హక్కుల మరియు రైతుల ప్రయోజనాల కోసం పోరాటం చేసిందని అన్నారు భారతదేశాన్ని ఏకాకృతం చేయడంలో కీలకపాత్ర పోషించారు ముఖ్యంగా 530 పైగా రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్ చేశాడని అన్నారు సర్దార్ వల్లభాయ్ జీవితం మనకు ఒక స్ఫూర్తిదాయకమని అన్నారు ఓదెల యువత మంచి ఉత్సాహంతో ముందుకు వచ్చారని అదేవిధంగా ఈ రన్నింగ్ చేయడం వల్ల శరీరానికి ఉల్లాసం కలిగి మనశ్శాంతి కలుగుతుందని యువత ఇలాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహించుకోవాలని ముఖ్యంగా రెండు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఒకటి గంజాయి ఇంకొకటి సైబర్ నేరం వీటిపై యువత జాగ్రత్తగా ఉండాలని గంజాయి వల్ల ఎన్నో అనర్ధాలు జరిగి కుటుంబాలే చీకటిమయమై అవుతాయని మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తులు అంధకారంలోకి వెళ్లిపోతారని దానివలన అనేక అనర్ధాలు జరుగుతాయని అన్నారు . వాటికి ఎంత దూరంగా ఉంటే జీవితం అంతా పూలవనంగా ఉంటుందని తెలియజేశారు ఈ సందర్భంగా శాంతి పావురాన్ని ఎగరవేసి 2కె రన్ ప్రారంభించారు ఈ రన్నింగ్ లో విజేతలకు మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతి విజేతలకు సీల్డ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో సీఐ సుబ్బారెడ్డి ఎస్సై దీకొండ రమేష్ తోపాటు మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ఎంపిటిసి బోడ కుంటి చిన్నస్వామి తోపాటు అల్లం సతీష్ డాక్టర్. సతీష్. డాక్టర్ ఎం భీష్మ చారి తో పాటు దాదాపు 200 మంది యువకులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily