Sunday, 29 March 2026 03:31:49 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రెండు మహిళా సంఘాల భవనాల మంజూరు * స్థల పరిశీలనకు వచ్చిన సీసీ భైరి సురేఖకు ఘన సన్మానం

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 17 January 2026 02:50 PM Views : 398

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / తెలంగాణ అప్డేట్స్ /అక్షరం డెస్క్ : జగిత్యాల జిల్లా/మెట్ పల్లి/జనవరి 17/అక్షరం న్యూస్: డివిజన్ లోని వేంపేట్ గ్రామానికి అదనంగా రెండు మహిళా సంఘాల భవనాలు మంజూరు అయిన సందర్భంగా స్థల పరిశీలన కోసం గ్రామానికి వచ్చిన మహిళా సంఘాల కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ (సీసీ) భైరి సురేఖ ని సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్ ఘనంగా శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చంద్రాచారి దశకంఠరాజు, జెల్ల శ్రీనివాస్ యాదవ్‌లు పాల్గొని సీసీని అభినందించారు. ఈ సందర్భంగా భైరి సురేఖ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా రుణాలు పొందుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని, మహిళల అభివృద్ధి ద్వారానే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని సర్పంచ్ ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యులు భరోసా ఇచ్చారు. అలాగే ప్రతి మహిళకు పథకాలపై పూర్తి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల వీవోఏలు పల్లి విజయ, జెల్ల లాస్యలు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :