DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 6 (అక్షరం న్యూస్): పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు శాంతినగర్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థి రెండ్ల రమ్య నాగరాజు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కార్యకర్తలు, అనుచరులతో కలిసి ఇంటింటా తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ, తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇస్తున్నారు. తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానని వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పనిచేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో మంచి స్పందన వ్యక్తమవుతోందని, రెండవ వార్డులో తమ అభ్యర్థికి అనుకూల వాతావరణం నెలకొందని పార్టీ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily