Tuesday, 20 May 2025 12:12:28 AM

ఓటికుండలుగా మంత్రుల మాటలు* *పేదలకు పట్టాలు.. పెద్దలకు ఇండ్లు*

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 05 May 2025 11:11 AM Views : 766

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ మే 5/ తల్లాడ (అక్షరంన్యూస్) నిరుపేదలకు గూడు కల్పించాలని సదుద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో చిన్న పిర్యాదు వచ్చిన ఊరుకునేది లేదు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాటలు ఓటి కుండలుగా మార్చుతున్నారు తల్లాడ మండలంలోని కొందరు అధికారులు. 76 ఏండ్ల స్వతంత్ర భారతంలో నేటికీ సరైన గూడు లేని నిరుపేదలందరో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇంటి కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది.ఎన్నికల మేనిఫెస్టివల్ హామీ ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపికను మొదలుపెట్టింది.అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు తల్లాడ మండలం కొంతమంది చోటా నాయకులు,అధికారులు తీసుకుంటున్న నిర్ణయం ఇందిరమ్మ ఇల్లు అనేది నిరుపేదలకు అందని ద్రాక్షగా మారింది.గుడిసెల్లో నివసించే వారికి, ఒంటరి మహిళలకు ఆర్థిక పరిస్థితి సరిగా లేని వారికి గృహాలు కేటాయించాలని నిబంధనలు ఉన్నా, తమకు నచ్చిన వారికి, అర్హత లేకపోయినా,ఇల్లు కేటాయించి, అభాసు పాలవుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.నాయిని, నాగమణి, ఎర్రబోలు రంగమ్మ, అరబోలు కృష్ణవేణి, పాలగాని, పద్మ ఎర్రబోలు కృష్ణవేణి, ఇలాంటి ఎందరో అర్హులైన వారికి ఇల్లు కేటాయించలేదు. ఇప్పటికైనా సంబంధిత సర్వే అధికారులు గ్రామంలో పరిశీలించి అర్హులకు ఇల్లు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :