D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/ సెప్టెంబర్ 20(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం సాధిరెడ్డి గ్రామం లో గల గిర్జన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల లోని ఉపాధ్యాయు లని అక్రమంగా, డిప్యూటేషన్ చేస్తూ పాఠశాలలో ని విద్యార్థులకు విద్యా అందకుండా చేసి పాఠశాలను మూసివేయడం కోసం కుట్రచేయడం సబబు కాదని ఉపాధ్యాయుల తరలింపు ను నిలిపివేయాలని ఈ రోజు గ్రామస్థులు పాఠశాల ఆవర్నములో నిరసన కార్యక్రమం ను చేశారు సాదిరెడ్డి పల్లి NYC అధ్యక్షులు ఈక శ్రీధర్ మాట్లాడుతూ గిర్జన సంక్షేమ అధికారులు పాఠశాలను పట్టించుకోకుండా ఉండటం తో పాటు సరైన వసతి సౌకర్యాలు లేక ప్రస్తుతం ఉన్న విద్యార్థులు భయానక వాతావర్ణం లో బిక్కు బిక్కు మంటూ చదువులు కొనసాగిస్తున్నారని,ఈ పాఠశాలకు బిల్డింగ్ సాంక్షన్ అయి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికి నిర్మాణం చేపట్టక పోవడం చాలా విచారంగా ఉందని పాఠశాల ఆవరనము అంతా గడ్డి, పిచ్చి మొక్కలతో నిండి అపరిశుభ్రంగా ఉందని, కనీసం ప్రహరీ గోడ కూడ లేక పోవడం బాధ కరంగా ఉందని శానిటేషన్ కూడ చేయడం లేదని,వంట గది సైతం లేకపోవడం బాధాకరంగా ఉందని,అన్నారు అదేవిధంగా తుడుందెబ్బ జిల్లా సమన్వయ కర్త ఆలూరి రాజు మాట్లాడుతూ, ఒకప్పడు ఈ పాఠశాల లో వందలాది మంది విద్యార్థులు ఉండేదని ఈ పాఠశాల ను అధికారులు నిర్లక్ష్యం చేయడం మూలంగానే ఇలాంటి పరిస్థితి దాపురించి ఉండదని ఈ యొక్క పాఠశాలను విద్యార్థుల శాతం తక్కువ ఉందనే సాకుతో పాఠషాలను మూసి వేసేందుకు టీచర్స్ ను ఒకొక్కరిగా డిప్యూటేషన్ చేస్తున్న అధికారులారా తక్షణమే ఈ తప్పుడు విధానము ను మానుకోవాలని ఇట్టివ విషయం లో జిల్లా కలెక్టర్, ఐటీడి ఏ పీవో గార్లు స్పందించి పాఠశాల పట్ల శ్రద్ద చూపాలని,లేకుంటే దశల వారీగా ఆందోళన చేస్తామని డెప్యూటేషన్ పై పంపిన ఉపాధ్యాయులను తిరిగి పాఠశాలకు పంపించాలని, ఇట్టి విషయం లో మంత్రి సీతక్క గారు చొర్వ చూపి పాఠశాలను కాపడాలని తమ నియోజక వర్గంలో ని ఈ పాఠషాలకు మంజూరి అయిన బెల్డింగ్ లని నిర్మాణం చూపించే దిశగా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు, కార్యక్రమం లో మండల అధ్యక్షులు ఈక విజయ్ కుమారు, మాజీ సర్పంచ్ పులషం పాపయ్య, ఆలూరి కిరణ్ కుమార్, ఆలూరి వంశీ పటేల్, వాసం నాగయ్య, ధనుసరి సారంగా పానీ, బంగారు చరణ్, ఈగం యాకయ్య, ధనుసరి సమ్మయ్య, వట్టం సారయ్య, లు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily