Saturday, 25 July 2026 08:39:47 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ నగేష్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 21 August 2025 04:46 PM Views : 553

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల ఆగస్టు 21/అక్షరం న్యూస్/----సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గిరిజన గ్రామం కిష్టారంపాడు లో డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామం లోని గిరిజనులందరికీ వైద్య పరీక్షలు ఇద్దరికీ జ్వరం లక్షణాలు ఉండడంతో వారికి ఆర్ డి టి పరీక్షలు చేసి మలేరియా జ్వరం కాదు మామూలు జ్వరం అని గుర్తించి మందులు ఇచ్చారు. అనంతరం డాక్టర్ నగేష్ గిరిజనులతో మాట్లాడుతూ జ్వరాలు వేస్తే అశ్రద్ధ చేయకుండా పీహెచ్సీ కి రావాలని ఆయన అన్నారు. పి హెచ్ సి లో అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. సురక్షితమైన సుఖప్రసవం కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తప్పకుండా రావాలని గర్భిణీ మహిళలకు సూచించారు. చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు తప్పకుండా వేయించాలన్నారు. వర్షాకాలం కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీళ్లు నిలవ లేకుండా చూసుకోవాలని దోమ తెరలను వినియోగించుకోవాలని ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటినే తీసుకోవాలంటూ సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై గిరిజనులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ బాబురావు హెల్త్ అసిస్టెంట్ సుబ్బారావు వేణు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :