D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : * మహబూబాబాద్ జిల్లా/ కొత్త గూడ/ జూన్ 10(అక్షరం న్యూస్) కొత్తగూడ మండలానికీ కెనరా బ్యాంక్ మంజూరుకీ కృషి చేసిన జాతీయ ST కమిషన్ సభ్యుడు జాటోత్.హుస్సేన్ నాయక్ గారిని బీజేపీ గిరిజన మోర్చా వనభందు సెల్ రాష్ట్ర కన్వీనర్ బోడ.నవీన్ నాయక్ ఆధ్వర్యంలో బీజేపీ కొత్తగూడ మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి ఏజెన్సీ మండలం అయినా కొత్తగూడ లో కెనరా బ్యాంక్ మంజూరు చేయించినందుకు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.* ఈ సందర్బంగా బీజేపీ గిరిజన మోర్చా వనభందు సెల్ రాష్ట్ర కన్వీనర్ బోడ.నవీన్ నాయక్ మాట్లాడుతు కొత్తగూడ మండలంలో ఒకటే బ్యాంక్ ఉండటం వల్ల బ్యాంక్ సౌకర్యం సకాలంలో అందకపోవడం తో ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారని ఈ విషయం పై గతంలో జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోత్.హుస్సేన్ నాయక్ గారిని మండల ప్రక్షాన బీజేపీ పార్టీ నాయకులు విన్నవించగా సానుకూలంగా స్పందించిన హుస్సేన్ నాయక్ గారు బ్యాంక్ ఉన్నత అధికారులతో మాట్లాడి కొత్తగూడ మండల ప్రజల చిరకాల కోరిక బ్యాంక్ ను మంజూరు చేయించినందుకు కొత్తగూడ మండల ప్రజల పక్షాన, భారతీయ జనతా పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం లో గూడూరు మాజీ ఎంపీపీ చెల్పూరి. వెంకన్న,గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి గుగులోత్.రాంబాబు నాయక్,బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి. మురళి, ప్రధాన కార్యదర్శి వజ్జ. రవి, మండల ఉపాధ్యక్షుడు కొట్టె శ్రీను, సీనియర్ నాయకులు సిరబోయిన., యాకయ్య, దండు ప్రవీణ్,పెనుక రామయ్య, బోడ. సుమన్,బాధవత్ లక్ష్మణ్,చిలుకల కుమార్,తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily