GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/నవంబర్ 15/అక్షరం న్యూస్: జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివారులో 25 మంది వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటో ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది. నలుగురికి తీవ్ర గాయాలు కాగా, కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన కూలీలను జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స తీసుకుంటున్న క్షత గ్రస్తులను జమ్మికుంట పట్టణ సిఐ రామకృష్ణ, ఎస్సై నాగరాజు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ కూలీలందరూ వీణవంక మండలం ఏలుబాక గ్రామానికి చెందిన వారిగా తెలిపారు. ఎలుబాక గ్రామం నుండి నగరం గ్రామానికి పత్తి ఏరాడనికి వెళ్తున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
.
Aksharam Telugu Daily