Monday, 12 January 2026 10:37:12 PM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పురుగుల మందు డబ్బాతో తల్లి కొడుకు కలెక్టరేట్ ఎదుట ఆందోళన

న్యాయం చేయకపోతే ఆత్మహత్యకే సిద్ధమంటూ హెచ్చరిక


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 19 June 2025 05:56 PM Views : 833

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జూన్ 19 అక్షరం న్యూస్ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బాతో తల్లి కొడుకు కన్నీరుమున్నీరు అయ్యారు న్యాయం జరిగే వరకు జీవితాన్ని అరగంతో పెట్టి పోరాటం చేస్తామని హెచ్చరించారు. సబ్బితం గ్రామానికి చెందిన రాజు శంకరయ్య అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై మానసికంగా ప్రభావితమయ్యారని అప్పటి నుంచి తరచూ ఇంటిని వదిలిపెట్టి తిరుగుతూ ఉంటారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు ప్రతి సారి స్థానికుల సాయంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చేవారన్నారు ఇలాంటి పరిస్థిలో తన భర్త పేరున ఉన్న 4 ఎకరాల 28 గుంటల భూమిని రాఘవపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేష్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. గతంలో కూడా భూమిని ఇతరులకు విక్రయించే ప్రయత్నం జరిగినపుడు కలెక్టరేట్ వద్ద ఫిర్యాదు చేసి భూమిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టించామని చెప్పారు. అయితే తాజాగా ఆడెపు వెంకటేష్ తన రాజకీయ బలాన్ని ఉపయోగించి అధికారుల సహకారంతో భూమి స్థితిని మార్చించి, పట్టా పొందాడని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై కలెక్టర్‌కు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల వైఖరి నిర్లక్ష్యంగా మారిందని వాపోయారు. మాకు న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ఆవరణలోనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం’’ అంటూ హెచ్చరించిన తల్లి-కొడుకులు, మాజీ సర్పంచ్ నుంచి తమకు ప్రాణహాని ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు వెంటనే స్పందించి, బాధితుల మొరను పరిశీలించి దర్యాప్తు జరిపించాలని, అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :